తేజస్విని సూసైడ్ వార్త కలచివేసింది: చంద్రబాబు
ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని కళాశాల ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన తన మనసును ఎంతగానో కలచివేసిందని తెదేపా అధినేత..
అమరావతి/ ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని కళాశాల ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన తన మనసును ఎంతగానో కలచివేసిందని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఏపీలో బోధనా ఫీజుల చెల్లింపు పథకం ఏమైందని ప్రశ్నించారు. యువత నిరాశతో ప్రాణాలు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించి.. తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని యువతి బలవన్మరణం
ఫీజు చెల్లింపు బాధలు తాళలేక ఒంగోలులోని గొడుగుపాలెంలో పాపిశెట్టి తేజస్విని (19) శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాగేశ్వరరావు ముఠా కూలీ. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం ఆగిపోవడంతో ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు.శుక్రవారం రూ.35వేలు ఫీజు చెల్లించిన తండ్రి ఇకపై తాను చెల్లించలేనని చెప్పడంతో మనస్తాపానికి గురైన తేజస్విని ఇంట్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
మరోవైపు, ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న క్విస్ ఇంజినీరింగ్ కళాశాల ఎదుట విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆ కళాశాల అటానమస్ హోదాను రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. అనంతరం ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్ రెడ్డి, డీఎస్పీ ప్రసాద్లకు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చదవండి..
ఎవ్వరు బెదిరించినా భయపడొద్దు:ఎస్ఈసీ | ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా? |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.