Andhra News: ప్రేమ పేరుతో యువతులకు మోసం.. పోలీసుల అదుపులో ఎస్ఐ
తిరుపతిలో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐ విజయకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రగిరి: తిరుపతిలో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐ విజయకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరిలో అతడిని అదుపులోకి తీసుకొని పామిడికి తీసుకెళ్లారు. ఎస్ఐపై దిశ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల కిందట ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ ఆ యువతిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. మనస్తాపంతో రెండో యువతి పామిడి మండలం జి.ఎ.కొట్టాలకు చెందిన సరస్వతి బాయి ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సరస్వతి మృతిచెందింది. ప్రేమించి మోసం చేశాడని మృతురాలి బంధువులు పామిడి పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ. విజయకుమార్ నాయక్ స్వగ్రామం పామిడి మండలం జి.ఎ.కొట్టాల.
ఎస్ఐ విజయకుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు తాడిపత్రి డీఎస్పీ తెలిపారు. ఎస్పై కేసు నమోదు చేసినట్లు.. ఇవాళ రిమాండ్కు పంపుతున్నట్లు చెప్పారు. ఇతనిపై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఫిర్యాదులొస్తే వివాదాల మధ్యే విజయకుమార్ వివాహం జరిగిందని డీఎస్పీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.