Andhra News: ప్రేమ పేరుతో యువతులకు మోసం.. పోలీసుల అదుపులో ఎస్‌ఐ

తిరుపతిలో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్‌ఐ విజయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 07 Dec 2022 14:05 IST

చంద్రగిరి: తిరుపతిలో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్‌ఐ విజయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరిలో అతడిని అదుపులోకి తీసుకొని పామిడికి తీసుకెళ్లారు. ఎస్‌ఐపై దిశ పోలీస్‌ స్టేషన్‌లో కొన్ని రోజుల కిందట ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ ఆ యువతిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. మనస్తాపంతో రెండో యువతి పామిడి మండలం జి.ఎ.కొట్టాలకు చెందిన సరస్వతి బాయి ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సరస్వతి మృతిచెందింది. ప్రేమించి మోసం చేశాడని మృతురాలి బంధువులు పామిడి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌.ఐ. విజయకుమార్‌ నాయక్‌ స్వగ్రామం పామిడి మండలం జి.ఎ.కొట్టాల.

ఎస్‌ఐ విజయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తాడిపత్రి డీఎస్పీ తెలిపారు. ఎస్‌పై కేసు నమోదు చేసినట్లు.. ఇవాళ రిమాండ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. ఇతనిపై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఫిర్యాదులొస్తే వివాదాల మధ్యే విజయకుమార్‌ వివాహం జరిగిందని డీఎస్పీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని