Shocking incident: ఫుల్గా తాగొచ్చి.. బిర్యానీతో పాటు నగలూ మింగేశాడు!
విచిత్రమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఫుల్గా తాగి ఈద్ పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి ఆ మైకంలో బిర్యానీతో .....
(ఫైల్ ఫొటో)
చెన్నై: చెన్నై నగరంలో విచిత్రమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఫుల్గా తాగి ఈద్ పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి ఆ మైకంలో బిర్యానీతో పాటు రూ.1.45లక్షల విలువ చేసే నగల్నీ మింగేశాడు. చివరకు వైద్యులు ఎనిమా ఇచ్చి అతడి పొట్టలోంచి నగల్ని బయటకు తీశారు. మే 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నగల దుకాణంలో పనిచేసే ఓ మహిళ ఈ నెల 3న తన ఇంట్లో ఈద్ పార్టీకి స్నేహితురాలితో పాటు ఆమె బాయ్ఫ్రెండ్నీ ఆహ్వానించింది. విందుకు వచ్చిన అతిథులందరికీ బిర్యానీ వడ్డించగా.. తప్పతాగి ఉన్న తన స్నేహితురాలి బాయ్ఫ్రెండ్ (32 ఏళ్లు) ఆ ఇంటి కబోర్డులో ఉన్న డైమండ్ నెక్లెస్, బంగారం చైన్, చెవి పోగులను మింగేశాడు. విందు పూర్తయి.. అతిథులంతా వెళ్లిపోయాక కబోర్డులోని ఆభరణాలు అదృశ్యమైనట్టు గుర్తించిన ఇంటి యజమాని.. అతిథులను సంప్రదించింది. అప్పటికీ తెలియకపోవడంతో చివరకు తన స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్పై అనుమానం వచ్చి విరుగంబక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మరుసటి రోజు మే 4న అతడిని పోలీసులు విచారించగా.. నేరం అంగీకరించాడు. దీంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లి స్కానింగ్ చేయగా పొట్టలో నగలు ఉన్నట్టు గుర్తించారు. వైద్యులు గురువారం అతడికి ఎనిమా ఇచ్చి రూ.95వేలు విలువ చేసే నెక్లెస్, రూ.25వేలువ చేసే బంగారు గొలుసును బయటకు తీశారు. డైమండ్ పెండెంట్ ఇంకా పొట్టలోనే ఉండిపోవడంతో విరేచనం మందు ఇచ్చారు. తాగిన మత్తులోనే ఇదంతా చేశాడని తెలియడంతో ఆ మహిళ తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM