Crime News: నువ్వు అమాయకురాలివైతే.. నీ కుమార్తెను తగులబెట్టు!
భర్త అనుమానపు సూటిపోటి మాటలు భరించలేక.. తాను అమాయకురాలినని నిరూపించుకునేందుకు ఓ వివాహిత తన పదేళ్ల కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర కాలిన గాయాలతో బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు...
చెన్నై: భర్త అనుమానపు సూటిపోటి మాటలు భరించలేక.. తాను అమాయకురాలినని నిరూపించుకునేందుకు ఓ వివాహిత తన పదేళ్ల కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర కాలిన గాయాలతో బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. విస్మయకర విషయాలు తెలిశాయి. వారి వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన జయలక్ష్మి(38)కి మొదట ఓ వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరికి ఓ పాప పుట్టింది. అనంతరం ఆమె భర్తను వదిలేసి, అతని సోదరుడితోనే రెండో వివాహం చేసుకుని, ముంబయికి వెళ్లిపోయింది. అక్కడ వారికి పవిత్ర(10) పుట్టింది. తర్వాత ఆమె రెండో భర్తనీ వదిలేసి, పవిత్రతో కలిసి చెన్నైకి చేరుకుని తిరువొత్తియుర్లో ఉంటోంది. తొమ్మిదేళ్ల క్రితం స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తున్న పద్మనాభన్ను పెళ్లి చేసుకుంది. అతనికి ఇది రెండో వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు.
అయితే, మద్యానికి బానిసైన పద్మనాభన్.. భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ అయింది. దీంతో తన పవిత్రతను నిరూపించుకోవాలని అతను ఆమెకు సవాల్ విసిరాడు. నీ కుమార్తె పవిత్రకు నిప్పంటించాలని.. ఒకవేళ నువ్వు అమాయకురాలివైతే ఆమెకు ఏం కాదని చెప్పాడు. దీంతో ఆమె.. నిద్రపోతున్న పాపను లేపి, కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు తాళలేక బాలిక పెట్టిన కేకలు విన్న ఇరుగుపొరుగువారు వెంటనే అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు.. దంపతులిద్దరినీ అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.