తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సురక్షితం
చిత్తూరు జిల్లా తిరుపతిలో అపహరణకు గురైన ఛత్తీస్గఢ్ బాలుడు శివమ్ సాహు సురక్షితంగా ఉన్నాడు. ఆరేళ్ల బాలుడిని విజయవాడలో గుర్తించిన పోలీసులు చైల్డ్ లైన్కు...
విజయవాడలో గుర్తించిన పోలీసులు
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో అపహరణకు గురైన ఛత్తీస్గఢ్ బాలుడు శివమ్ సాహు సురక్షితంగా ఉన్నాడు. ఆరేళ్ల బాలుడిని విజయవాడలో గుర్తించిన పోలీసులు చైల్డ్ లైన్కు అప్పగించారు. గత నెల 27వ తేదీన తిరుపతి అలిపిరిలో శివమ్ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాలుడు కిడ్నాప్కు గురైనప్పటినుంచి అతని తల్లిదండ్రులు తిరుపతిలోనే బాలుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. బాలుడు దొరికిన విషయాన్ని విజయవాడ పోలీసులు తిరుపతి అర్బన్ పోలీసులకు తెలియజేశారు. దీంతో అర్బన్ పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు విజయవాడకు బయలుదేరారు. బాలుడిని త్వరలో తల్లిదండ్రుల వద్దకు చేర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లోని కురూస్ గ్రామం నుంచి ఫిబ్రవరి 23న ప్రైవేటు బస్సులో 55 మంది ఆలయాల సందర్శన నిమిత్తం బయలుదేరి వచ్చారు. వారిలో ఉత్తమ్ కుమార్ సాహు కుటుంబానికి చెందిన నలుగురిలో... శివమ్ కుమార్ సాహు(6) ఉన్నాడు. 27న తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు చేరుకుని శ్రీవారి దర్శనార్థం టోకన్లు తీసుకున్నారు. అదేరోజు స్థానిక ఆలయాలు సందర్శించి... మరుసటి రోజు ఉదయం తిరుమలకు వెళ్లేందుకు తిరిగి బాలాజీ లింకు బస్టాండు వద్దకే వచ్చారు. భోజనాలు చేసి పడుకునే సమయంలో శివమ్ కుమార్ సాహు కన్పించలేదు. చుట్టుపక్కల వెతికినా కన్పించకపోవడంతో అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!