Nellore: వైకాపా నేత చెప్పాడని.. సీఐ చితక బాదేశారు
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వైకాపా నేత చెప్పాడని వెంకటాచలం సీఐ .. ఓ వ్యక్తిని చితక బాదిన ఘటన స్థానికులను కలచివేసింది.
వెంకటాచలం: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వైకాపా నేత చెప్పాడని వెంకటాచలం సీఐ .. ఓ వ్యక్తిని చితక బాదిన ఘటన స్థానికులను కలచివేసింది. కుటుంబ గొడవల్లో కనుపూరు వైకాపా సర్పంచ్ చెప్పాడని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చెవిటి వ్యక్తిని స్టేషన్కు తీసుకెళ్లి వెంకటాచలం సీఐ అంకమరావు చితక బాదారు. సీఐ కొట్టిన దెబ్బలు చూపించి బాధితుడు బోరున విలపించాడు.
బాధితుడు మోమిడి వెంకట రమణయ్య బీపీ, థైరాయిడ్, షుగర్తో బాధపడుతున్నాడని అతని భార్య నాగమ్మ తెలిపారు. ఒంటిపై గాయాలను చూపిస్తూ.. సీఐ మానవత్వం మరచి కొట్టాడని వాపోయారు. కాళ్లు చేతులు వాచిపోయేలా చితకబాదాడని ఆరోపించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ అంకమరావు బాధితుడిని బెదిరించి ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్ఛార్జి చేయించారని, తీవ్రగాయాలతోనే స్వగ్రామమైన ఇందూరుకు తీసుకెళ్లేలా చేశారని నాగమ్మ తెలిపారు. సీఐ అంకమరావు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిందితులను అరెస్టు చేయకపోతే మాకు ప్రాణహాని
తన బిడ్డ చావుకు కారకులను అరెస్టు చేయకపోతే తమ కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆత్మహత్య చేసుకున్న బొంతా మహేంద్ర తల్లి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. -
అమెరికాలో వైకాపా నాయకుడి దాష్టీకం
వైకాపా నేతల అరాచకాలు, దౌర్జన్యాలు అమెరికానూ తాకాయి. ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండి క్రియాశీలకంగా వ్యవహరించే సత్తారు వెంకటేశ్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల వయసున్న ఓ నిరుపేద యువకుడ్ని అక్కడ కొన్ని నెలలుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. -
భద్రాద్రి జిల్లాలో 40 కిలోల ల్యాండ్మైన్ వెలికితీత
పోలింగ్ విధులకు హాజరైన భద్రతా బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రను భగ్నం చేసినట్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడించారు. -
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
మణిపుర్లో 10 మంది దుండగులు ఓ బ్యాంకులోకి తుపాకులతో చొరబడి రూ.18.80 కోట్లు దోచుకున్నారు. ఉఖ్రుల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. -
బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు
బడి గంటలు మోగక ముందే.. శుక్రవారం ఉదయమే బెంగళూరులోని ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
ఛత్తీస్గఢ్లో ఉపసర్పంచి హత్య
ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 23వ వారోత్సవాల వేళ విధ్వంసానికి పాల్పడటంతోపాటు ఓ ఉపసర్పంచిని హత్య చేశారు. -
మావోయిస్టులకు ఆయుధాల తరలింపు కేసులో 8 మందిపై అభియోగపత్రం దాఖలు
మావోయిస్టులకు పేలుడు పదార్థాలతోపాటు ఆయుధాల తయారీ సామగ్రిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఎనిమిది మంది నిందితులపై హైదరాబాద్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) న్యాయస్థానంలో శుక్రవారం అభియోగ పత్రాలు దాఖలయ్యాయి.