Kolkata: దొంగతనం ఆరోపణతో యువకుడిని చితకబాదిన పోలీసు

చోరీకి యత్నించాడనే ఆరోపణతో యువకుడిని నడిరోడ్డుపై ఓ పోలీసు వలంటీర్ చితకబాదిన ఘటన పశ్చిమబెంగాల్‌లో వెలుగుచూసింది.

Published : 10 Nov 2021 01:30 IST

కోల్‌కతా: చోరీకి యత్నించాడనే ఆరోపణతో యువకుడిని నడిరోడ్డుపై ఓ పోలీసు వాలంటీర్‌ చితకబాదిన ఘటన పశ్చిమబెంగాల్‌లో వెలుగుచూసింది. కోల్‌కతాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బస్సులో తన బ్యాగును ఆ యువకుడు దొంగిలించడానికి యత్నించాడని.. ఓ మహిళ ఆరోపించింది. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. అయితే.. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు వాలంటీర్ తన్మయ్ బిశ్వాస్.. ఆ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాడు. అతడిని మరింత దారుణంగా కొట్టాడు. కాలుతో ఛాతీపై తన్నాడు. ఈ ఘటనపై పోలీసు శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తన్మయ్ బిశ్వాస్‌ను విధుల నుంచి తప్పించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని