Crime News: ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న స్వామి(46) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 27 Feb 2023 15:33 IST

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న స్వామి(46) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ విధులకు హాజరైన స్వామి.. డీటీసీ పక్కనున్న ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని థారూర్‌ మండలం ఇబ్బనూరు గ్రామానికి చెందిన స్వామి 1998లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. స్వామి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని