AP news : తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరి మృతి !

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందారు. పుదూరు గ్రామానికి చెందిన కొండారి చైతన్య (25), జగన్‌ (25) స్నానం చేసేందుకు తెలుగు గంగ కాల్వలో..

Published : 27 Jan 2022 01:34 IST

నాయుడుపేట పట్టణం: నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందారు. పుదూరు గ్రామానికి చెందిన కొండారి చైతన్య (25), జగన్‌ (25) స్నానం చేసేందుకు తెలుగు గంగ కాల్వలో దిగారు. ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లిపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయారు. మల్లు విష్ణు అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుల్లో చైతన్య చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుండగా.. జగన్‌ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని