West Bengal: దంపతుల నుంచి 12కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

మాల్దా పట్టణ రైల్వే స్టేషన్‌లో దంపతుల నుంచి 2.5 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 07 Apr 2022 23:08 IST

కోల్‌కతా: మాల్దా పట్టణ రైల్వే స్టేషన్‌లో దంపతుల నుంచి 2.5 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ  సుమారు రూ.12కోట్లు ఉంటుందని అంచనా . స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియా సఫియాన్‌ (20),  మోస్తఫా (28) దంపతులు  2.5 కిలోల హెరాయిన్‌ను సంగీత పరికరంలో  పెట్టి తీసుకెళ్తుండా అదుపులోకి తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో విక్రయించేందుకు హెరాయిన్‌  తీసుకెళ్తున్నట్టు  పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితులను అరెస్టు చేసి   స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని