చిన్నారికి వేధింపులు.. వృద్ధ జంటకు జైలు
అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో 80 ఏళ్ల వృద్ధ జంటకు మహారాష్ట్ర ప్రత్యేక న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి రేఖా ఎన్ పందారే పోక్సో చట్టం ప్రకారం శుక్రవారం తీర్పును వెలువరించారు. ఎనిమిదేళ్ల కింద..
ముంబయి: అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో 80 ఏళ్ల వృద్ధ జంటకు మహారాష్ట్ర ప్రత్యేక న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి రేఖ పోక్సో చట్టం ప్రకారం శుక్రవారం తీర్పును వెలువరించారు. ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
2013 సెప్టెంబర్ 4న పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి తొలుత భోజనం చేసి తన స్నేహితురాలితో ఆడుకోవడానికి అదే అపార్టుమెంటులోని నాలుగో అంతస్తుకు వెళ్లింది. ఆ సమయంలో తన స్నేహితురాలు నిద్రించి ఉండడంతో తిరిగి వస్తున్న క్రమంలో తాత-నాన్నమ్మ అంటూ ముద్దుగా పిలుచుకునే వృద్ధ దంపతులు చిన్నారిని ఆపారు. స్నేహంగా మాట్లాడుతూ ఇంట్లోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని వివస్త్రను చేసి, వారించినందుకు కొడుతూ లైంగికంగా వేధించారు. ఈ ఘటనలో వృద్ధుడి భార్య సహకరించడం గమనార్హం. అయితే, వృద్ధ దంపతుల చేష్టల నుంచి తప్పించుకున్న చిన్నారి.. రాత్రి తన తల్లికి ఈ విషయాన్ని తెలియజేసింది. చిన్నారి లోదుస్తులను విప్పి చూడగా విషయం బయటకొచ్చింది. అనంతరం తన భార్తతో కలిసి ఆమె స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటి రోజు దంపతులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!