Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ చావుకి కారణాలు వెల్లడిస్తూ దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన లింగసముద్రం

Published : 24 Jun 2022 01:53 IST

లింగసముద్రం: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. తన భర్తను తాగుడుకు బానిసయ్యేలా చేయడంతో పాటు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే తామిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. ఓ లేఖ కూడా రాశారు.

పోలీసుల కథనం ప్రకారం... ‘‘నా చావుకి, నా భర్త చావుకి కారణం షేక్‌ ఇలియాజ్‌. నా భర్త తాగుడికి బానిసయ్యేలా చేశాడు. ఆయన ద్వారా నాకు మత్తు మందు ఇచ్చి స్పృహతప్పి పడిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మేమిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తర్వాత అయినా అతడికి శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం’’ అని బాధితురాలు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది. ఆ తర్వాత దంపతులిద్దరూ పురుగుల మందు తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు దంపతులిద్దరూ సెల్ఫీవీడియో ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. నిందితుడు వారిని ఎలా బ్లాక్‌  మెయిల్‌ చేసిందీ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని