Crime News: యాదాద్రిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ మావోయిస్టులు అరెస్టు

యాదాద్రిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు మాజీ మావోయిస్టులను అరెస్టు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ‘‘నిందితులు  పిట్టల

Updated : 07 Nov 2021 05:32 IST

హైదరాబాద్‌: యాదాద్రిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు మాజీ మావోయిస్టులను అరెస్టు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ‘‘నిందితులు  పిట్టల శ్రీనివాస్‌, నాగమలయ్య, శ్రీనివాసరెడ్డి, స్వామి గతంలో జనశక్తి గ్రూప్‌లో పనిచేశారు. ప్రధాన నిందితుడు పిట్టల శ్రీనివాస్‌కు తుపాకీ తయారు చేయడం తెలుసు. వీరంతా యాదాద్రిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాగమలయ్య గతంలో ఓ హత్యకేసులో నిందితుడు. శ్రీనివాసరెడ్డితో కలిసి నాగమల్లయ్య 1996లో పనిచేశారు. పిట్టల శ్రీనివాస్‌ అతని భార్య పుష్ప మావోయిస్టులు. వీరి నుంచి 3 తుపాకులు, నాటు తుపాకీ, 6 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నాం’’ అని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని