Karnataka: నిను వీడలేను.. బతికుండలేను
ఆ అమ్మాయిలిద్దరూ కవలలు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆడుతూపాడుతూ పెరిగారు. జీవితాంతం అలాగే ఉండాలని కలలు కన్నారు. పెళ్లి వయసు వచ్చింది. వారి తల్లిదండ్రులు వేర్వేరు కుటుంబాల వారికి ఇచ్చి వివాహాలు చేసేందుకు
మండ్య, న్యూస్టుడే: ఆ అమ్మాయిలిద్దరూ కవలలు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆడుతూపాడుతూ పెరిగారు. జీవితాంతం అలాగే ఉండాలని కలలు కన్నారు. పెళ్లి వయసు వచ్చింది. వారి తల్లిదండ్రులు వేర్వేరు కుటుంబాల వారికి ఇచ్చి వివాహాలు చేసేందుకు నిర్ణయించడంతో ఎడబాటు తప్పదని భావించి కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా హణసనహళ్లిలో చోటుచేసుకుంది. మృతులను దీపిక, దివ్య(19)లుగా గుర్తించారు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. సోమవారం ఉదయం ఆ విషయం వెలుగు చూసింది. అరెకెరె పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ