AP News: నదిలోకి దూకి.. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని మొగలికుదురు గ్రామానికి చెందిన భార్యాభర్తలు  శనివారం తమ ఇద్దరు పిల్లలతో సహా చంచినాడ వారధిపై నుంచి వశిష్ఠ నదిలోకి దూకి గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated : 01 Aug 2021 07:03 IST

మామిడికుదురు, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని మొగలికుదురు గ్రామానికి చెందిన భార్యాభర్తలు  శనివారం తమ ఇద్దరు పిల్లలతో సహా చంచినాడ వారధిపై నుంచి వశిష్ఠ నదిలోకి దూకి గల్లంతైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారధిపై ఉన్న ద్విచక్ర వాహనం, పిల్లల దుస్తులను పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంలో చోటుచేసుకున్న గొడవలే ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు చేసిన మోసం, వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్య పేరుతో ఉన్న ఓ లేఖ, ఆడియో వాట్సప్‌ గ్రూపుల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని