viral video: పట్టపగలే వ్యాపారిపై కాల్పులు

పట్టపగలు అందరూ చూస్తుండగానే కొంతమంది దుండగులు ఓ వ్యాపారిపై కాల్పులకు తెగబడిన ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. కోటాలోని గుమన్‌పురా పోలీసుస్టేషన్ పరిధిలోని....

Published : 16 Jun 2021 01:22 IST

జైపూర్‌: పట్టపగలు అందరూ చూస్తుండగానే కొంతమంది దుండగులు ఓ వ్యాపారిపై కాల్పులకు తెగబడిన ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. కోటాలోని గుమన్‌పురా పోలీసుస్టేషన్ పరిధిలోని కూరగాయల మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు దుండగులు రెండు ద్విచక్ర వాహనాలపై ఓ దుకాణం వద్దకు వచ్చారు. అందులోని ఓ వ్యక్తి తుపాకీ తీసి దుకాణంలో ఉన్నవారిపై ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. కొన్ని రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అదృష్టవశాత్తూ దుకాణం యజమాని ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని