కారులో కరెన్సీ కట్టలు

ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఈరోజు ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా నగదు పట్టుబడింది.

Published : 08 Apr 2021 01:07 IST

జగ్గయ్యపేట: ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఈరోజు ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న కోటి నలభైలక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై సెక్షన్‌ 102 కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు చిల్లకల్లు ఎస్‌ఐ వాసా వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని