మెయిల్ ఐడీ మార్చి.. నగదు కొల్లగొట్టి
విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన బ్యాంక్ ఉద్యోగి కొల్లు నాగేశ్వరరావు.. క్రెడిట్ కార్డులు పొందిన నిరక్షరాస్యులను టార్గెట్గా చేసుకుని వారి ఖాతాలో నగదు మాయం చేస్తున్నట్టు నగరంపాలెం ఇన్ఛార్జి ..
గుంటూరు: విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన బ్యాంక్ ఉద్యోగి కొల్లు నాగేశ్వరరావు.. క్రెడిట్ కార్డులు పొందిన నిరక్షరాస్యులను టార్గెట్గా చేసుకుని వారి ఖాతాలో నగదు మాయం చేస్తున్నట్టు నగరంపాలెం ఇన్ఛార్జి సీఐ రత్నస్వామి తెలిపారు. ఈనెల 2న గుంటూరికి చెందిన తోట శ్రీకాంత్ తన క్రెడిట్ కార్డు నుంచి రూ.2,53,250 నగదు మాయమైనట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
సీఐ కథనం ప్రకారం.. గుంటూరు వెంకటరమణ కాలనీకి చెందిన తోట శ్రీకాంత్ ద్విచక్రవాహనాల మెకానిక్ దుకాణం నిర్వహిస్తుంటాడు.ఐదేళ్లుగా కొటక్ మహేంద్రబ్యాంక్ క్రెడిట్కార్డు ఉపయోగిస్తున్నాడు. ఈనెల 2న మధ్యాహ్నం తన చరవాణికి క్రెడిట్కార్డు ద్వారా రూ.2,53,250 వాడుకున్నట్టు సంక్షిప్త సందేశం వచ్చింది. ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా నగదు వాడుకున్నట్టు సందేశం రావడంతో ఆందోళనకు గురైన బాధితుడు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కృష్ణా జిల్లా విజయవాడకి చెందిన కొల్లు నాగేశ్వరరావు ఎంబీఏ పూర్తి చేసి నగరంలోని కొటక్ మహేంద్ర బ్యాంకులో క్రెడిట్కార్డు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన నాగేశ్వరరావు సునాయాసంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. క్రెడిట్కార్డు పొందిన వారిలో సాంకేతిక పరిజ్ఞానం లేనివారిని, నిరక్షరాస్యులను టార్గెట్గా చేసుకున్నాడు. క్రెడిట్కార్డు పొందే సమయంలో వారు ఇచ్చే మెయిల్ ఐడీలను మార్చి కొత్త మెయిల్ ఐడీని క్రియేట్ చేసి వాటి సాయంతో ఓటీపీ తెలుసుకుని నగదు మాయం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు నాగేశ్వరరావు ఈరోజు మధ్యాహ్నం గుంటూరుకి చెందిన శ్రీకాంత్ క్రెడిట్కార్డుతో బంగారు దుకాణంలో ఆభరణాలు కొనుగోలు చేశాడు. దుకాణం యజమానికి మెసేజ్ వచ్చింది కానీ నగదు జమకాలేదు. ఎంత సేపటికి నగదు ఖాతాలోకి జమకాకపోవడం గమనించిన నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు. దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ జరిగిందని బాధితుడు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అకౌంట్ ఫ్రీజ్ చేశామని, అందుకే బంగారు దుకాణంలో నగదు బదిలీ కాలేదని సీఐ తెలిపారు. నాగేశ్వరరావును అరెస్టు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు సీఐ రత్నస్వామి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.