Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ సైబర్ క్రైం పోలీసులు ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే
హైదరాబాద్: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ సైబర్ క్రైం పోలీసులు ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ సైబర్ క్రైం పోర్టల్లో కానీ, హెల్ప్లైన్ నంబర్ 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా బాధితుడి ఖాతా నుంచి బదిలీ అయిన నగదును ఇతర ఖాతాలకు బదిలీ అవ్వకుండా చేయవచ్చని తెలిపారు. సత్వరమే ఫిర్యాదు చేసేందుకు గతేడాది జూన్లో తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ సైబర్ నేరగాళ్లు కాజేసిన ₹15.48 కోట్లను వారి ఖాతాల్లో నిలుపుదల చేశామన్నారు. ఆర్ధిక పరమైన ఫిర్యాదులను నమోదు చేసిన వెంటనే అవి సీఎఫ్ఆర్ఎంఎస్లోకి వెళతాయని, దీంతో వెంటనే సంబంధిత నేరగాళ్ల ఖాతాల్లోని నగదు సీజ్ అవుతుందని సైబర్ క్రైం పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే