Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్: వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను సేకరించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. ఈ సందేశాల ద్వారా వారు పంపే లింకులను క్లిక్ చేయడంతో వినియోగదారుల వ్యక్తిగత డేటా మొత్తం చోరీ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా అనవసర సందేశాలు పంపుతూ దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
కేవైసీ అప్డేట్, క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలంటూ ఇటీవల హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంకుల పేరుతో అధిక సంఖ్యలో సందేశాలు వచ్చాయి. వీటిపై మూడు కమిషనరేట్ల పరిధిలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీన్ని సవాల్గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా ఈ దందా చేస్తున్న వారిని అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్పై స్పందించిన వెంకటేశ్
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Ts-top-news News
ధరణిలో ఊరినే మాయం చేశారు