Andhra News: ఎమ్మెల్యేల నుంచి వసూళ్లు ... గాజువాకలో ప్రియురాలికి రూ.80లక్షలతో ఇల్లు
గాజువాక శ్రీనగర్లో సైబర్ నేరస్థుడు విష్ణుమూర్తి అలియాస్ సాగర్ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖపట్నం: రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన అభియోగాలపై విశాఖలోని గాజువాక శ్రీనగర్కు చెందిన నిందితుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పి.విష్ణుమూర్తి(20) (అలియాస్ సాగర్) ఇటీవల రాజస్థాన్కు చెందిన ఎమ్మెల్యే సందీప్ యాదవ్కు పలుమార్లు ఫోన్లు చేసి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, రూ.20 లక్షలు పంపాలని కోరాడు. దీంతో ఆ ఎమ్మెల్యే సైబర్క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి బివాడీ పోలీస్స్టేషన్కు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టరు జితేంద్రసింగ్ నేతృత్వంలో సిబ్బంది చరవాణి లోకేషన్ ఆధారంగా గాజువాక శ్రీనగర్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్పై నిందితుడిని రాజస్థాన్ తీసుకెళ్లారు.
సీఎంవో నుంచి మాట్లాడుతున్నానంటూ విష్ణుమూర్తి అక్కడి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి దాదాపు రూ.2.5కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో రూ.80లక్షలతో ప్రియురాలికి గాజువాకలో ఇల్లు కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. విష్ణుమూర్తిపై గతంలోనూ విశాఖ సైబర్ క్రైం, కాశీబుగ్గ పీఎస్లో మొత్తం నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2019లోనూ ఏపీలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ1.80 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?