Cyber Fraud: రూ.360 కోట్ల సైబర్ మోసం
దేశంలో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. చైనా, హాంకాంక్కు చెందిన సైబర్ నేరగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం లాభాలను ఆశజూపి భారతీయుల నుంచి ఏకంగా రూ.360 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు....
డెహ్రాడూన్: దేశంలో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. చైనా, హాంకాంగ్లకు చెందిన సైబర్ నేరగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం లాభాలను ఆశజూపి భారతీయుల నుంచి ఏకంగా రూ.360 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో ఈ మోసం బయటపడింది. చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు ఓ మొబైల్ యాప్ రూపొందించారు. అందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన భారత్కు చెందిన అనేక మంది కోట్లాది రూపాయలను వీరు చెప్పిన ఖాతాలో జమ చేశారు. అలా చేరిన రూ.360 కోట్లను మోసగాళ్లు వివిధ ఆన్లైన్ మార్గాల ద్వారా చైనాలోని బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. అక్కడి నుంచి ఈ సొమ్ము ‘పవర్ బ్యాంక్’ యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి చేరింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న మరికొన్ని యాప్లను దర్యాప్తు అధికారులు గుర్తించారు.
హాంకాంగ్ నేరగాళ్లకు సహాయం అందించారనే ఆరోపణలతో దేశంలోని ఇ-వ్యాలెట్ పేటీఎం, రేజర్పే ప్రతినిధులకు ఉత్తరాఖండ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్లో ఇద్దరు కీలక నిందితులు సహా బెంగళూరులో నలుగురు, దిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ మోసంలో విదేశీయుల హస్తం ఉండటంతో సీబీఐ, ఐబీ, ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
గంజాయి మిల్క్షేక్!
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!