Dalit Boy Death: 23రోజుల్లో 6 ఆస్పత్రులు తిప్పినా.. దక్కని బాలుడి ప్రాణం
టీచర్ చేతిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని 23 రోజుల్లో ఆరు ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ ఫలితం దక్కలేదని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు.
రాజస్థాన్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న దళిత బాలుడి మృతి
జైపుర్: రాజస్థాన్లో తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు (Dalit Boy) మృత్యువాతపడిన దారుణ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ (NCSC) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదికను రాష్ట్ర(Rajasthan) సామాజిక న్యాయశాఖ అధికారులు జాతీయ ఎస్సీ కమిషన్కు అందించారు. టీచర్ చేతిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని 23 రోజుల్లో ఆరు ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ ఫలితం దక్కలేదని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు. రాజస్థాన్లోని జాలోర్ జిల్లా సురానా గ్రామంలోని ఓ పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా పలు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పోలీసులు నివేదిక ప్రకారం, ఇంద్రా మేఘావాల్ (9) అనే విద్యార్థికి తీవ్రంగా దప్పిక వేయడంతో ఉపాధ్యాయుల కోసం ఉంచిన కుండలోని నీటిని తాగేందుకు ప్రయత్నించాడు. అది చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన చైల్ సింగ్ (45) అనే ఉపాధ్యాయుడు.. ఆ విద్యార్థిని చితకబాదాడు. దాంతో విద్యార్థి కిందపడిపోవడంతోపాటు చెవుల నుంచి రక్తస్రావం కావడం మొదలయ్యింది. ఈ విషయాన్ని పాఠశాల ముందే రిపేర్ షాపు నిర్వహిస్తున్న తన తండ్రి దేవారామ్ మేఘావాల్కి చెప్పిన విద్యార్థి.. చెవినొప్పి తీవ్రంగా ఉందని పేర్కొన్నాడు. కుమారుడి బాధను చూసిన దేవారామ్ తొలుత బగోడాలోని బజరంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించాడు. చికిత్స తీసుకున్న అనంతరం రెండు రోజులకు చెవి నొప్పి మళ్లీ తీవ్రమవడంతో భీన్మల్లోని ఆస్థా మల్టీస్పెషాలిటీ (రెండో) ఆస్పత్రిలో చేర్పించారు.
23 రోజుల్లో ఆరు ఆస్పత్రులు..
అక్కడ చికిత్స తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో అదే పట్టణంలోని త్రివేణి మల్టీ స్పెషాలిటీ ట్రామా (మూడో ఆస్పత్రి) కేంద్రంలో చూపించారు. రెండు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కూడా చెవి నొప్పిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో గుజరాత్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో గుజరాత్లోని దీసా పట్టణంలో ఉన్న కర్ణీ ఆస్పత్రికి (నాలుగో ఆస్పత్రి) తీసుకెళ్లి అక్కడా ఒకరోజు చికిత్స చేయించారు. మళ్లీ త్రివేణీ ఆస్పత్రి వచ్చి.. అక్కడ నుంచి మరో న్యూరో సెంటర్లో (ఐదో ఆస్పత్రి) చూపించారు. అక్కడ ఆరు రోజులు చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో చివరకు ఉదయ్పుర్లోని గీతాంజలి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వారు అహ్మదాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి (ఆరో ఆస్పత్రి) సిఫార్సు చేశారు.
ఇలా దాదాపు 23 రోజుల్లో ఆరు ఆస్పత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికీ నొప్పి తీవ్రత మరింత ఎక్కువ కావడం, బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 13న ప్రాణాలు కోల్పోయాడు. ఇది చూస్తుంటే, బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతోనే ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి వైద్యులు సిఫార్సు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్పర్సన్ విజయ్ సాంప్లా పేర్కొన్నారు. ఇది కేవలం ఒకేదెబ్బ కొట్టడం వల్ల జరగలేదని అభిప్రాయపడిన ఆయన.. వాస్తవంగా ఏం జరిగిందనే విషయంపై పూర్తి నివేదిక అందించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. వెనుకబడిన కులాల వారిపై వివక్ష చూపించే ఇటువంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలోనూ చూశామన్న కమిషన్.. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. మరోవైపు ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదు జారీ చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR).. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్