అమానుషం! కాళ్లతో తన్నుతూ.. కర్రలతో బాదుతూ..

ఓ దళితుడిపై అగ్ర కులానికి చెందిన కొందరు వ్యక్తులు క్రూరత్వాన్ని ప్రదర్శించారు. కాళ్లతో తన్నుతూ.. కర్రలు, రాడ్లతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌ జిల్లా అక్బాపూర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది....

Published : 11 Jul 2021 01:07 IST

కాన్పూర్‌: ఓ దళితుడిపై అగ్ర కులానికి చెందిన కొందరు వ్యక్తులు క్రూరత్వాన్ని ప్రదర్శించారు. కాళ్లతో తన్నుతూ.. కర్రలు, రాడ్లతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌ జిల్లా అక్బాపూర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఓ గుడిసెలో కూర్చున్న 20 ఏళ్ల యువకుడి వద్దకు వెళ్లిన కొందరు వ్యక్తులు అతడిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. నీ కులం చెప్పాలంటూ కొట్టారు. ఆ యువకుడు తన కులం చెప్పడంతో మరింత రెచ్చిపోయిన ఆ గ్యాంగ్‌.. యువకుడి జుట్టు పట్టి లాగి కిందపడేసి కర్రలు, కాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు నొప్పితో కేకలు వేస్తున్నా విడిచిపెట్టలేదు. ఇది చాలదన్నట్లు అనంతరం ఓ చెట్టుకు కట్టేసి మళ్లీ కొట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విషయం కాన్పూర్‌ పోలీసుల దృష్టికి వెళ్లడంతో  ఓ నిందితుడిని అరెస్టు చేశారు. దాడి చేసిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు  అదనపు ఎస్పీ ఘన్‌శ్యామ్‌ చౌరాసియా వెల్లడించారు. బాధిత యువకుడు ప్రస్తుతం కాన్పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని