దారుణం: అదనపు వడ్డీ కోసం.. మహిళను వివస్త్రను చేసి.. నోట్లో మూత్రం పోయించి..!
Woman stripped, urinated: అదనపు వడ్డీ చెల్లించలేదని ఓ మహిళను వివస్త్రను చేసి, ఆమె నోట్లో మూత్రం పోయించిన దారుణ ఘటన బిహార్లో చోటుచేసుకుంది.
పట్నా: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని దళిత మహిళపై ఓ వ్యక్తి అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు. ఆమెను వివస్త్రను చేసి దాడి చేశాడు. ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఈ అమానుష ఘటన బిహార్ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పట్నా జిల్లా మోసిమ్పుర్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త.. స్థానికంగా పలుకుబడి ఉన్న ప్రమోద్ సింగ్ వద్ద కొన్ని నెలల క్రితం రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. అదనపు వడ్డీ ఇవ్వాల్సిందేనని ప్రమోద్ సింగ్ డిమాండ్ చేశాడు. అందుకు వారు అంగీకరించలేదు. దీంతో ఆ దంపతులపై కోపం పెంచుకున్న ప్రమోద్.. గతవారం సదరు మహిళకు ఫోన్ చేసి బెదిరించాడు. అదనపు వడ్డీ ఇవ్వకపోతే గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిమజ్జనానికి ముందుగా వెళ్లారని దళితులపై దాడి.. వైకాపా నాయకుల ప్రోద్బలంతో..
ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్ గత శనివారం రాత్రి అతడి అనుచరులతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై దాడి చేశాడు. మహిళను వివస్త్రను చేసి కర్రలతో కొట్టించాడు. అక్కడితో ఆగకుండా తన కుమారుడితో మహిళ నోట్లో మూత్రం పోయించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితులైన ప్రమోద్ సింగ్, అతడి కుమారుడు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. బాధిత మహిళ ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిందితులను అరెస్టు చేయకపోతే మాకు ప్రాణహాని
తన బిడ్డ చావుకు కారకులను అరెస్టు చేయకపోతే తమ కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆత్మహత్య చేసుకున్న బొంతా మహేంద్ర తల్లి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. -
అమెరికాలో వైకాపా నాయకుడి దాష్టీకం
వైకాపా నేతల అరాచకాలు, దౌర్జన్యాలు అమెరికానూ తాకాయి. ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండి క్రియాశీలకంగా వ్యవహరించే సత్తారు వెంకటేశ్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల వయసున్న ఓ నిరుపేద యువకుడ్ని అక్కడ కొన్ని నెలలుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. -
భద్రాద్రి జిల్లాలో 40 కిలోల ల్యాండ్మైన్ వెలికితీత
పోలింగ్ విధులకు హాజరైన భద్రతా బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రను భగ్నం చేసినట్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడించారు. -
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
మణిపుర్లో 10 మంది దుండగులు ఓ బ్యాంకులోకి తుపాకులతో చొరబడి రూ.18.80 కోట్లు దోచుకున్నారు. ఉఖ్రుల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. -
బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు
బడి గంటలు మోగక ముందే.. శుక్రవారం ఉదయమే బెంగళూరులోని ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
ఛత్తీస్గఢ్లో ఉపసర్పంచి హత్య
ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 23వ వారోత్సవాల వేళ విధ్వంసానికి పాల్పడటంతోపాటు ఓ ఉపసర్పంచిని హత్య చేశారు. -
మావోయిస్టులకు ఆయుధాల తరలింపు కేసులో 8 మందిపై అభియోగపత్రం దాఖలు
మావోయిస్టులకు పేలుడు పదార్థాలతోపాటు ఆయుధాల తయారీ సామగ్రిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఎనిమిది మంది నిందితులపై హైదరాబాద్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) న్యాయస్థానంలో శుక్రవారం అభియోగ పత్రాలు దాఖలయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!