Telangana News: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ .. నిందితుల్లో ప్రముఖ వ్యక్తి కుమారుడు
జూబ్లీహిల్స్లో బాలిక(17)పై అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పుప్పాలగూడ వాసి సాదుద్దీన్ మాలిక్(18)ను అరెస్టు చేశామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మరో నిందితుడిని రేపు ఉదయం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో...
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో బాలిక(17)పై అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పుప్పాలగూడ వాసి సాదుద్దీన్ మాలిక్(18)ను అరెస్టు చేశామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మరో నిందితుడు(జువైనల్)ని గుర్తించాం.. రేపు ఉదయం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈకేసులో హోం మంత్రి మనువడి ప్రమేయం ఉందన్న ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చారు. ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడి పాత్ర ఉన్నట్టు ఆధారాలు లభించాయని, అతను మైనర్ కావడంతో వివరాలు వెల్లడించలేకపోతున్నామన్నారు.
ఐదుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు..
‘‘తన కుమార్తెపై దాడి జరిగిందని ఈనెల 31వ తేదీ రాత్రి బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. 28వ తేదీ జరిగిన పార్టీకి బాలిక వెళ్లింది. ఘటన తర్వాత బాధితురాలు షాక్లోకి వెళ్లింది. మా పాపపై లైంగిక దాడి జరిగి ఉంటుందని తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. మరుసటి రోజు పాపను భరోసా కేంద్రానికి తీసుకొచ్చి కౌన్సెలింగ్ చేసి వివరాలు తెలుసుకున్నాం. భరోసా కేంద్రం అధికారులు పూర్తి సమాచారం సేకరించి మాకు పంపించారు. ఆ తర్వాత అంతకు ముందు నమోదు చేసిన కేసుతో పాటు అత్యాచారం, పోక్సో చట్టం కింద మరిన్ని సెక్షన్లు కలిపి కేసు నమోదు చేశాం. ఎవరెవరు దాడికి పాల్పడ్డారనేది బాధితురాలు స్పష్టంగా చెప్పలేకపోయింది. ఒక నిందితుడి పేరు మాత్రం వెల్లడించింది. ఆ వివరాల ఆధారంగా... ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం. సీసీ టీవీ ఫుటేజ్ మొత్తం సేకరించాం. సీడీఆర్ ఎనాలసిస్ చేసి... బాలిక చెప్పిన వివరాలతో సీసీటీవీ ఫుటేజీని సరి పోల్చుకుని ఐదుగురు నిందితులను గుర్తించాం. ఇందులో ముగ్గురు 16.. 17ఏళ్లలోపు వారే. వారిలో పుప్పాలగూడ వాసి సాదుద్దీన్ మాలిక్(18)ని అరెస్టు చేశాం. రాత్రిపూట మైనర్ను చట్ట ప్రకారం అదుపులోకి తీసుకోకూడదు. మరో నిందితుడు ఉమేర్ఖాన్ (18), మిగతా ముగ్గురు మైనర్లు కావడంతో చట్ట ప్రకారం వారి పేర్లు వెల్లడించలేక పోతున్నాం.
ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం లేదు..
మరో 48 గంటల్లో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తాం. సాంకేతిక ఆధారాలు సేకరించాం. బాధితురాలు కోలుకున్న తర్వాత 164 సెక్షన్ ప్రకారం మరోసారి స్టేట్మెంట్ తీసుకుని, ఇందులో ఇంకా ఎవరి పాత్రైనా ఉందనే అనేదానిపై పూర్తిగా దర్యాప్తు చేస్తాం. నిందితులు ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం. హోం మంత్రి మనువడు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నిరాధారమైన ఆరోపణ మాత్రమే. బాలిక ఫిర్యాదు ఆధారంగా అన్ని ప్రాంతాల్లో మినిట్ టు మినిట్ సీసీటీవీ ఫుటేజ్ను సేకరించాం. ఇన్ని ఆధారాలు సేకరించిన తర్వాత కూడా హోం మంత్రి మనువడి ప్రమేయం ఉందని ఆరోపణలు చేయడం దారుణం. వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధితురాలి ఫొటో, పేర్లు ప్రచురించిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటాం. ఓ ప్రజాప్రతినిధి కుమారుడు (జువైనల్) ఉన్నట్టు కచ్చితమైన సమాచారం ఉంది. (జువైనల్ యాక్టు ప్రకారం పేరు చెప్పకూడదు.) ఇప్పటివరకు ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పబ్లోకి పార్టీ ఉందని బాలికను తీసుకెళ్లారు. పబ్లో పార్టీ ఎలా జరిగిందనే దానిపై ఇంకా దర్యాప్తు చేయలేదు. పబ్లో నిబంధనలు అతిక్రమించి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని బాలిక చెప్పలేదు. సీసీ టీవీ ఫుటేజీలో కూడా అలాంటి ఆధారాలు లభించలేదు. నిందితులతో బాలికకు ఇంతకుముందు పరిచయం లేదు. అందుకే వారి పేర్లు కచ్చితంగా చెప్పలేకపోతోంది. బాలిక పూర్తిగా కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. బాలిక కుటుంబం షాక్లో ఉండటంతో ఘటన జరిగిన 3రోజుల వరకు ఫిర్యాదు చేయలేకపోయారు. నాకే స్వయంగా వచ్చి ఫిర్యాదు చేస్తే, పోలీస్ స్టేషన్ రిఫర్ చేశా. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో నిందితులు వీడియో తీసినట్టు అనుమానమే తప్ప.. ఎక్కడా ఆధారాల్లేవు. ఈకేసులో ముందుగా బాలికను ఎవరు తీసుకెళ్లారు అనేది చెప్పలేకపోతోంది’’ అని డీసీపీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు