crime news: మానవ మృగాలు! మూగ, చెవిటి బాలికపై అమానుషం
మధ్యప్రదేశ్ షాదోల్లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మూగ, చెవిటి బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా.....
భోపాల్: మధ్యప్రదేశ్ షాదోల్లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మూగ, చెవిటి బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా.. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. కొత్వాలి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మూగ, చెవిటి బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ యువకుడు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో ఐదుగురు కాపు కాస్తున్నారు. అనంతరం మొత్తం ఆరుగురు ఆ అభాగ్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశారు.
అనంతరం బాధితురాలిని ఇంటివద్ద వదిలేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాలిక ఇంట్లో చెప్పుకోలేపోయింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు వెలుగుచూడటంతో విషయం తండ్రికి తెలిసింది. కుమార్తెను ఆరా తీయగా ఆమె బోరుమంది. తనపై జరిగిన రాక్షసకాండను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలికను విచారించగా పలు సంజ్ఞల ద్వారా వారికి కూడా విషయాన్ని తెలియజేసింది. దీంతో పలు అనుమానితుల ఫొటోలను పోలీసులు బాలికకు చూపించగా.. నిందితులను ఆమె గుర్తించింది. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అవధేశ్ గోస్వామి వెల్లడించారు. అయితే అందులో నలుగురు మైనర్లేనని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.