Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య
Odisha Train Tragedy: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య 278కి చేరింది. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
బాలేశ్వర్: ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో రైలు పట్టాలపై సంభవించిన మృత్యుఘోషలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 278 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది గాయపడగా.. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (Odisha Train Tragedy)
ఇప్పటికీ బోగీల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఓడీఆర్ఎఫ్ ముమ్మరంగా గాలిస్తోంది. అటు భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 1200 మంది సిబ్బంది ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు.
ఒడిశాకు ప్రధాని మోదీ..
ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నేడు సమీక్ష చేపట్టారు. రైల్వే శాఖ ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమైన ఆయన.. పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు, ప్రధాని ఈ రోజు ఒడిశా రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలుత బాలాసోర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ప్రధాని పరిశీలించనున్నారు. అనంతరం కటక్లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిందిలా..
స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హావ్డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Bengaluru-Howrah Superfast Express ) బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్పై పడిపోయాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ (Shalimar-Chennai Central Coromandel Express) ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ కోల్కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందని అమితాబ్ చెప్పారు. దాని 10-12 బోగీలు బెంగళూరు-హావ్డా సూపర్ఫాస్ట్ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్ఫాస్ట్ బోగీలు పక్క ట్రాక్పై బోల్తాపడ్డాయని వివరించారు. ప్రయాణికుల రైళ్లు అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!