Terror attack: ఉగ్రవాదులకు 14 రోజుల రిమాండ్.. గణపతి నిమజ్జనాల వద్ద ముష్కరుల రెక్కీ!
దిల్లీ: దేశంలో హత్యలు, పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు దిల్లీలోని పటియాల హౌస్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. ఉగ్రవాదులను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. ముష్కరులను జాన్ మహమ్మద్ అలీ షేక్, ఒసామా, మూల్ చంద్, జీషన్ ఖమర్, మహ్మద్ అబూబకర్, మహ్మద్ అమీర్ జావేద్గా గుర్తించారు. వీరిలో ఒసామా, జీషన్ ఖమర్ పాకిస్థాన్లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని భారత్కు తిరిగి వచ్చారని దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు ముష్కరులను మస్కట్ మీదుగా పాక్ తీసుకెళ్లి.. బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. అనేక నగరాల్లో ఉగ్ర దాడులు చేసేవిధంగా నిందితులకు నిధులు, ఆయుధాలు కూడా అందాయని పోలీసులు వెల్లడించారు.
అలీ షేక్, మూల్ చాంద్లకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు, పాక్లో నివసిస్తున్న అనీస్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని, ఉగ్రదాడికి ఆయుధాల సరఫరా చేసే బాధ్యతను వారికి అప్పగించారని పోలీసులు తెలిపారు. ఉగ్ర మూకల లక్ష్య జాబితాలో హిందూత్వ నాయకులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వీరు వినాయక నిమజ్జనాలు, రైల్వేస్టేషన్ల వద్ద రెక్కీ నిర్వహించినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పండుగలను లక్ష్యంగా చేసుకొని భారత్లో భారీ పేలుళ్లకు ఈ ముఠా కుట్రలు పన్నింది. అందులో భాగంగానే.. ముంబయిలో పుట్టి పెరిగిన జాన్ మహమ్మద్ అలీ షేక్ దక్షిణ ముంబయి ప్రాంతంలో కొద్ది రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలిపారు. అతడు ఏళ్లపాటు ముంబయిలో డ్రైవర్గా పనిచేసినట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పేలుళ్లు జరిపేందుకు ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ముంబయి సబర్బన్ రైల్వేస్టేషన్లలోనూ అతడు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్