Terror attack: ఉగ్రవాదులకు 14 రోజుల రిమాండ్.. గణపతి నిమజ్జనాల వద్ద ముష్కరుల రెక్కీ!
దేశంలో హత్యలు, పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు దిల్లీలోని పటియాల హౌస్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది......
దిల్లీ: దేశంలో హత్యలు, పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు దిల్లీలోని పటియాల హౌస్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. ఉగ్రవాదులను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. ముష్కరులను జాన్ మహమ్మద్ అలీ షేక్, ఒసామా, మూల్ చంద్, జీషన్ ఖమర్, మహ్మద్ అబూబకర్, మహ్మద్ అమీర్ జావేద్గా గుర్తించారు. వీరిలో ఒసామా, జీషన్ ఖమర్ పాకిస్థాన్లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని భారత్కు తిరిగి వచ్చారని దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు ముష్కరులను మస్కట్ మీదుగా పాక్ తీసుకెళ్లి.. బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. అనేక నగరాల్లో ఉగ్ర దాడులు చేసేవిధంగా నిందితులకు నిధులు, ఆయుధాలు కూడా అందాయని పోలీసులు వెల్లడించారు.
అలీ షేక్, మూల్ చాంద్లకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు, పాక్లో నివసిస్తున్న అనీస్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని, ఉగ్రదాడికి ఆయుధాల సరఫరా చేసే బాధ్యతను వారికి అప్పగించారని పోలీసులు తెలిపారు. ఉగ్ర మూకల లక్ష్య జాబితాలో హిందూత్వ నాయకులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వీరు వినాయక నిమజ్జనాలు, రైల్వేస్టేషన్ల వద్ద రెక్కీ నిర్వహించినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పండుగలను లక్ష్యంగా చేసుకొని భారత్లో భారీ పేలుళ్లకు ఈ ముఠా కుట్రలు పన్నింది. అందులో భాగంగానే.. ముంబయిలో పుట్టి పెరిగిన జాన్ మహమ్మద్ అలీ షేక్ దక్షిణ ముంబయి ప్రాంతంలో కొద్ది రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలిపారు. అతడు ఏళ్లపాటు ముంబయిలో డ్రైవర్గా పనిచేసినట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పేలుళ్లు జరిపేందుకు ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ముంబయి సబర్బన్ రైల్వేస్టేషన్లలోనూ అతడు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి