
Triple Suicide: ఇంటిని గ్యాస్ ఛాంబర్గా మార్చి.. ఊపిరాడకుండా చేసుకొని..!
దిల్లీలో తల్లి సహా ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ యాభైనాలుగేళ్ల మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. , ఇంటిని మొత్తం గ్యాస్ ఛాంబర్గా మార్చి.. ఊపిరాడకుండా చేసుకొని మరణించడం ప్రతిఒక్కరిని కలచి వేస్తోంది. అంతేకాకుండా ఇంట్లోకి వచ్చిన వారు నిప్పు వెలిగించవద్దని.. అలా చేస్తే మరింత ప్రమాదం సంభవిస్తుందని అప్రమత్తం చేస్తూ సూసైడ్ నోట్లో పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది.
దక్షిణ దిల్లీలోని వసంత్ విహార్లో మంజు (54) అనే మహిళ ఇద్దరు కుమార్తెలు అన్షిక (27), అంకూ (25)లతో కలిసి నివాసం ఉంటోంది. మంజూ భర్త కొవిడ్ కారణంగా గతేడాదే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి తీవ్ర కుంగుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే, శనివారం సాయంత్రం వరకూ మంజు ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడంతోపాటు లోపలి నుంచి తాళం వేసినట్లు గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపులు తెరచి లోనికి ప్రవేశించగా.. బెడ్రూమ్లో ముగ్గురు విగతజీవులుగా పడివున్నట్లు కనుగొన్నారు. వారి పక్కనే సూసైడ్ నోట్నూ గుర్తించారు. ఇంటి వాతావరణాన్ని పరిశీలించిన పోలీసులు.. ఇంటిని మొత్తం గ్యాస్ ఛాంబర్గా మార్చడం వల్ల ఊపిరాడకనే మరణించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారకు వచ్చారు.
నిప్పు రగిలించొద్దు..
సూసైడ్ నోట్ ప్రకారం.. తొలుత ఇంట్లోని కిటికీలను పాలిథిన్ కవర్తో ప్యాక్ చేశారు. అనంతరం గ్యాస్ సిలిండర్ను ఓపెన్ చేసి ఇంటిని మొత్తం గ్యాస్ ఛాంబర్గా మార్చారు. అంతేకాకుండా ‘చాలా ప్రమాదకర వాయువుతో ఇల్లు నిండివుంది. అగ్గిపుల్ల లేదా లైటర్ను వెలిగించవద్దు. ఇల్లు మొత్తం చాలా ప్రమాదకరమైన విషవాయువు (కార్బన్ మోనాక్సైడ్)తో నిండిపోయింది. ఈ వాయువును కూడా పీల్చవద్దు’ అని హెచ్చరిస్తూ లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఊపిరాడకపోవడంతోనే మంజు సహా ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది తన భర్త మరణించడం, మంజు ఆరోగ్యం కూడా ఇటీవల సరిగా లేకపోవడం వంటి కారణాలు వారిని ఆత్మహత్యను ప్రేరేపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Komatireddy: భూములిచ్చిన రైతులకు బేడీలా? కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
-
India News
MLAs Dance: మహా సీఎంగా శిందే.. ఎగిరి గంతులేసిన రెబల్ ఎమ్మెల్యేలు
-
General News
urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!
-
Politics News
Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్రెడ్డి
-
Technology News
iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై ఆఫర్..₹ 20 వేల వరకు తగ్గింపు!
-
India News
Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
- Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)