Cyber Fraud: ఫ్రీ థాలీ కోసం ఆశపడితే.. రూ.90వేలు పోయే..!
Cyber Fraud: ఆఫర్ కోసం పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుందో మహిళ. వారి మాటలు నమ్మి ఆన్లైన్ లింక్పై క్లిక్ చేసి భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంది.
దిల్లీ: ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ.. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడూ మనసును లాగేస్తూనే ఉంటాయి. అలాగైనా ఖర్చు తగ్గించుకోవచ్చని చూస్తాం. కానీ అక్కడే సరిచూసుకోకపోతే బోల్తా కొట్టడం ఖాయం. అదే పరిస్థితి దిల్లీకి చెందిన ఓ మహిళా ఉద్యోగిని(Delhi Woman)కి ఎదురైంది. ఫ్రీ థాలీ(Free Thali) కోసం ఒక లింక్ మీద క్లిక్ చేసి, రూ.90 వేలు పోగొట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..(Cyber Fraud)
బాధితురాలు ఓ బ్యాంక్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఫేస్బుక్ పోస్టు ద్వారా ఆమెకు థాలీ ఆఫర్ గురించి తెలిసింది. ఒక థాలీ కొంటే ఇంకో థాలీ ఫ్రీ అని పోస్టు సారాంశం. ఆ వివరాలు తెలుసుకునేందుకు సదరు సైట్లోకి వెళ్లి, అందులో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేశారు. అయితే ఆమె కాల్కు ఎలాంటి స్పందనా రాలేదు. ఆ తర్వాత ఆమెకు ఆ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఒక ప్రముఖ రెస్టారంట్ నుంచి అదనంగా థాలీ పొందచ్చని ఆ ఆఫర్ వివరాలను తెలిపారు.
‘తర్వాత కాలర్ ఒక లింక్ షేర్ చేశారు. దాని ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆఫర్ పొందచ్చని చెప్పారు. అందుకోసం ముందుగా రిజిస్టర్ కావాలన్నారు. ఆ యాప్లోకి వెళ్లి యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేశా. ఇంక అంతే.. నా ఫోన్పై నాకు నియంత్రణ లేకుండా పోయింది. అది హ్యాక్ అయింది. వెంటనే రూ.40వేలు డెబిట్ అయ్యాయని సందేశం వచ్చింది. ఆ తర్వాత రూ.50 వేలు డెబిట్ అయ్యాయని మరో సందేశం వచ్చింది. నా క్రెడిట్ కార్డు నుంచి నా పేటీఎం ఖాతాకు, ఆ తర్వాత నకిలీ ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయి. అసలు నేను ఆ వివరాలు ఏవీ వారికి ఇవ్వలేదు. అయినా డబ్బు అలా బదిలీ కావడం చూసి ఆశ్చర్యపోయా. వెంటనే క్రెడిట్ కార్డును బ్లాక్ చేశా’ అని ఆమె తెలిపారు. ఒకవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతోన్న సమయంలోనే .. వేరే నగరాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
మరోపక్క ఆ ప్రముఖ రెస్టారంట్ చైన్ ప్రతినిధిని సంప్రదించగా.. ‘ఈ మోసపూరిత ప్రకటన గురించి మాకు ప్రజలనుంచి చాలా కాల్స్ వచ్చాయి. మే అలాంటి ఆఫర్లు ఏమీ ప్రకటించలేదు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని వెల్లడించారు. ‘సైబర్ నేరగాళ్లు వేర్వేరు మార్గాల ద్వారా ప్రజలను మోసగించాలని చూస్తున్నారు. గుర్తు తెలియని లింకులు, యాప్లపై క్లిక్ చేయొద్దు’ అని సైబర్క్రైమ్ విభాగం అధికారులు హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప 81వ బెటాలియన్లో చోటు చేసుకుంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు