Kidnap: చంద్రగిరిలో వైద్యురాలి కిడ్నాప్.. ప్రేమ పెళ్లి ఇష్టం లేకనే..!
ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ వైద్యురాలిని కొంతమంది కిడ్నాప్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మోహన్రెడ్డి కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
చంద్రగిరి: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ వైద్యురాలిని కొంతమంది కిడ్నాప్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మోహన్రెడ్డి కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యురాలి కుటుంబసభ్యులే పథకం ప్రకారం కిడ్నాప్ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన సుష్మ.. చంద్రగిరి ప్రాంతానికి చెందిన డాక్టర్ మోహన్కృష్ణ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల క్రితం వాళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి సుష్మ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో ఎన్నోసార్లు ఆమెను తిరిగి తమ ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి సుమారు సుమారు 30 మంది వ్యక్తులు కత్తులు, రాడ్లతో మోహన్కృష్ణ ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించారు. ఇంటి అద్దాలు, టీవీ, ఫర్నీచర్, తలుపులను ధ్వంసం చేసి గదిలో ఉన్న సుష్మాను బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు.
మోహన్కృష్ణ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు సుష్మాను తీసుకుని వెళ్లిపోవడంతో మోహన్కృష్ణ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఆమెను గుంటూరు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై మోహన్కృష్ణ కుటుంబసభ్యులు చంద్రగిరి పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు