Crime news: హోటల్‌ గదిలో డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఆత్మహత్య

కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌ గదిలో మెదక్‌కు చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ..

Updated : 12 Sep 2021 20:15 IST

హైదరాబాద్‌: హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన డాక్టర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ మెదక్‌లో అనురాధ నర్సింగ్‌ హోమ్‌ పేరుతో ఆసుపత్రిని ఏర్పాటు చేసి తన భార్యతో కలిసి గత 20 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యుడిగా మంచి గుర్తింపు పొందిన చంద్రశేఖర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఆగస్టులో మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన రియల్టర్‌ ధర్మకారి శ్రీనివాస్‌ హత్యకేసులో చంద్రశేఖర్‌ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఆ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. నిజాంపేటలో తన కుమారుడికి నీట్‌ పరీక్ష ఉండటంతో ఈరోజు చంద్రశేఖర్‌ తన భార్యతో కలిసి వచ్చారు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద  వదిలిపెట్టిన తర్వాత అతని భార్య అత్యవసర సర్జరీ కేసు ఉండటంతో తిరిగి మెదక్‌ వెళ్లారు. చంద్రశేఖర్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని సితార గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారు. గదిలోకి వెళ్లిన అతను ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్‌ భార్య వస్తే గాని అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని