శంషాబాద్‌లో భారీగా హెరాయిన్‌ పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం డీఆర్‌ఐ అధికారులు భారీగా హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి..

Updated : 13 Sep 2023 12:48 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం డీఆర్‌ఐ అధికారులు భారీగా హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి 12 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ విలువ రూ.78 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల లగేజీ తనిఖి చేయగా బ్యాగ్‌, పైప్‌ రోల్‌ దాచిన 12 కిలోల హెరాయిన్‌ బయటపడిందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు