ఇంటికి తాళం వేసి నిప్పు..
కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కనూరు గ్రామంలో మద్యం మత్తులో ఓ ఆకతాయి ఓ ఇంటికి తాళం వేసి నిప్పంటించాడు. ఈ దుర్ఘటనలో 8 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.....
ఆరుగురి సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆకతాయి ఓ ఇంటికి తాళం వేసి నిప్పంటించాడు. కనూరు గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు ఘటనాస్థలిలోనే సజీవ దహనమయ్యారు. తీవ్ర గాయాలపాలైన మరో ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిప్పంటించిన వ్యక్తిని బోజా(50)గా గుర్తించారు. సదరు వ్యక్తికి బాధిత కుటుంబానికి వివాదాలు ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం