Andhra News: మత్తులో దూకాడు... నూకలుండి బతికిపోయాడు

ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అనుకున్నట్లే నదిలో దూకేశాడు. కానీ భూమి మీద నూకలు ఉండటంతో బతికాడు. ఈ ఘటన

Updated : 23 Sep 2022 06:48 IST

శ్రీకాకుళం, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అనుకున్నట్లే నదిలో దూకేశాడు. కానీ భూమి మీద నూకలు ఉండటంతో బతికాడు. ఈ ఘటన శ్రీకాకుళంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం దండి వీధికి చెందిన భరత్‌ కుమార్‌ గురువారం బాగా మద్యం తాగాడు. డే అండ్‌ నైట్‌ కూడలి సమీపంలోని నాగావళి వంతెనపై నుంచి దూకాడు. అయితే నదిలో ఆయన పడిన ప్రాంతంలో లోతు తక్కువగా ఉండటం, ప్రవాహం పెద్దగా లేకపోవడంతో మునిగిపోలేదు. ఇటీవల వచ్చిన వరదలకు నదిలో ఓ చోట చెత్త పేరుకుపోయింది. బయటకు వచ్చే మార్గం లేక దానిపై పడుకున్నాడు. స్థానికులు గమనించి విషయాన్ని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు తెలియజేశారు. వారు అక్కడకు వెళ్లి భరత్‌ కుమార్‌ను ఒడ్డుకు చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని