panaji: గోవాలో డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

భారత్ కు వచ్చిన ఓ విదేశీ పర్యాటకురాలిపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డచ్‌కు చెందిన మహిళతో గోవాలోని హోటల్‌ సిబ్బందిలో ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Published : 31 Mar 2023 13:20 IST

పనాజీ(గోవా): భారత్ కు వచ్చిన ఓ విదేశీ పర్యాటకురాలిపై గోవాలో దాడి జరిగింది. డచ్‌కు చెందిన మహిళతో గోవాలోని హోటల్‌ సిబ్బంది ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించాడు.  ఆమెతో పాటు రక్షించేందుకు వచ్చిన స్థానిక వ్యక్తిని పోడిచి పరారయ్యాడు. ఎస్పీ నిధిన్‌ వల్సన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డచ్‌(Dutch) నుంచి గోవాకు వచ్చిన యురికో అనే పర్యాటకురాలు ఉత్తర గోవా(North Goa) పెర్నెమ్‌లోని ఓ హోటల్‌లో దిగారు. హోటల్ సిబ్బందిలో ఒకడైన అభిషేక్‌ వర్మ మంగళవారం రాత్రి ఆమె గదిలోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించి వేధించాడు.

భయంతో మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి అడ్డుకున్నారు. దాంతో అభిషేక్‌ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ రాడని అనుకునే లోపే కత్తితో తిరిగి వచ్చాడు. అడ్డుకున్న వ్యక్తిపై దాడి చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా పోడిచి పరారయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందుతుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టిన పోలీసులు శుక్రవారం అతణ్ని అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రెండేళ్లుగా ఆ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని