panaji: గోవాలో డచ్ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు
భారత్ కు వచ్చిన ఓ విదేశీ పర్యాటకురాలిపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డచ్కు చెందిన మహిళతో గోవాలోని హోటల్ సిబ్బందిలో ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించాడు.
పనాజీ(గోవా): భారత్ కు వచ్చిన ఓ విదేశీ పర్యాటకురాలిపై గోవాలో దాడి జరిగింది. డచ్కు చెందిన మహిళతో గోవాలోని హోటల్ సిబ్బంది ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెతో పాటు రక్షించేందుకు వచ్చిన స్థానిక వ్యక్తిని పోడిచి పరారయ్యాడు. ఎస్పీ నిధిన్ వల్సన్ తెలిపిన వివరాల ప్రకారం.. డచ్(Dutch) నుంచి గోవాకు వచ్చిన యురికో అనే పర్యాటకురాలు ఉత్తర గోవా(North Goa) పెర్నెమ్లోని ఓ హోటల్లో దిగారు. హోటల్ సిబ్బందిలో ఒకడైన అభిషేక్ వర్మ మంగళవారం రాత్రి ఆమె గదిలోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించి వేధించాడు.
భయంతో మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి అడ్డుకున్నారు. దాంతో అభిషేక్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ రాడని అనుకునే లోపే కత్తితో తిరిగి వచ్చాడు. అడ్డుకున్న వ్యక్తిపై దాడి చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా పోడిచి పరారయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందుతుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టిన పోలీసులు శుక్రవారం అతణ్ని అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రెండేళ్లుగా ఆ హోటల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!