Delhi Liquor Scam: రామచంద్ర పిళ్లైకి వారం రోజుల ఈడీ కస్టడీ..

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అతడిని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి.. వారం రోజుల కస్టడీకి కోరారు.

Published : 07 Mar 2023 15:49 IST

దిల్లీ : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు చేసిన రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అతడిని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి.. వారం రోజుల కస్టడీకి కోరారు. దీనికి కోర్టు అనుమతించింది. విచారణకు పిళ్లై సహకరించడం లేదని కోర్టుకు ఈ సందర్భంగా ఈడీ తెలిపింది. పిళ్లైని ఈడీ, సీబీఐ ఇప్పటికే 39 సార్లు పిలిచాయని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని సోమవారం అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని ఈడీ అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని