Telangana News: ప్రియుడితో కలిసి తండ్రిని కడతేర్చిన కుమార్తె
ఓవైపు తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతూ మరోవైపు భూమి పత్రాలు ఇవ్వడం లేదనే కక్షతో కన్న తండ్రిని ఓ కూతురు (17).. ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన మహబూబాబాద్ మండలంలోని ఓ
మహబూబాబాద్ రూరల్, న్యూస్టుడే: ఓవైపు తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతూ మరోవైపు భూమి పత్రాలు ఇవ్వడం లేదనే కక్షతో కన్న తండ్రిని ఓ కూతురు (17).. ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన మహబూబాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న కన్నతండ్రి (45)ని నిర్దాక్షిణ్యంగా హతమార్చింది ఓ కుమార్తె. ఆ రైతు భార్య ఏడాది కిందట కరోనాతో మృతి చెందింది. దీంతో ఆ కుమార్తె ఏడో తరగతి మధ్యలోనే చదువు మానివేసి ఇంట్లోనే ఉంటోంది. తండ్రికి అర ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఆయనకు మద్యం తాగే అలవాటు ఉండడంతో వారి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. ఉన్న కాస్త వ్యవసాయ భూమి విక్రయిస్తాడనే భయంతో గ్రామంలో పెద్దమనుషులను ఆయన కుమార్తె ఆశ్రయించింది. వారి సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆ పత్రాలను వారి వద్దే భద్రపరిచారు. ఈ విషయంలో తండ్రి, కూతురు మధ్య గొడవలు మరింత పెరిగాయి. గురువారం ఉదయం మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ప్రియుడు వెంకటేశ్తో కలిసి తండ్రిని కర్రలతో విపరీతంగా కొట్టింది. శరీరంలో పలు చోట్ల బలమైన గాయాలు తగిలి ఆయన మరణించారు. తండ్రిని కొట్టిన తర్వాత ఇంటికి తాళం వేసి గ్రామంలోని కొంతమందికి తన తండ్రితో జరిగిన ఘర్షణ గురించి తెలియజేసింది. గ్రామస్థులకు అనుమానం కలిగి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆయన విగతజీవిగా కనిపించారు. దీంతో వారు మహబూబాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం రూరల్ సీఐ రవికుమార్, ఎస్సై అరుణ్కుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు. వారి విచారణలో ఆమెకు గ్రామంలోని వెంకటేశ్తో ప్రేమ వ్యవహారం ఉందని తెలిసింది. పెళ్లికి కొద్దికాలం ఆగాలని తండ్రి మందలించడంతో ఆమె కక్ష పెంచుకుందని తెలిసింది. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు ఆ కూతురుపై, వెంకటేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్