Accident: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
పుట్టెడు దుఃఖంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు బయల్దేరిన బంధువులకు.. అదే చివరి ప్రయాణమైంది! పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దాదాపు 18 మంది మృతి చెందారు....
కోల్కతా: పుట్టెడు దుఃఖంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు బయల్దేరిన బంధువులకు.. అదే చివరి ప్రయాణమైంది! పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దాదాపు 18 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దాదాపు 35 మందికిపైగా బంధువులు ఓ మినీ ట్రక్కులో చక్దా నుంచి నబద్వీప్లోని శ్మశానానికి వెళ్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వారు ప్రయాణిస్తున్న వాహనం హన్స్ఖాలీలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో, చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగా దారి కనిపించక ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘నాడియా రోడ్డు ప్రమాదం గురించి విని నా గుండె పగిలింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మమతా ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. షా సైతం.. తీవ్ర సంతాపం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!