Crime news: కిరాతకం.. 12 ఏళ్ల బాలుడిపై నలుగురి అత్యాచారం!
దేశ రాజధాని నగరంలో అమ్మాయిలకే కాదు బాలురకూ రక్షణలేకుండా పోయింది! నార్త్ దిల్లీలోని శీలంపూర్ ప్రాంతంలో 12ఏళ్ల.....
పోలీసులకు డీసీడబ్ల్యూ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ నోటీసులు
దిల్లీ: దేశ రాజధాని నగరంలో అమ్మాయిలకే కాదు బాలురకూ రక్షణలేకుండా పోయింది! నార్త్ దిల్లీలోని శీలంపూర్ ప్రాంతంలో 12ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు కిరాతకానికి పాల్పడ్డారు. ఆ పసివాడిపై లైంగిక దాడి చేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ అమానవీయ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనను ట్విటర్లో వెల్లడించిన ఆమె.. ‘‘దిల్లీలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ భద్రతలేదు. 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు కిరాతకంగా లైంగిక దాడి చేసి కర్రలతో కొట్టి అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై మా బృందం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేశాం’’ అని పేర్కొన్నారు.
దిల్లీలో అబ్బాయిలకూ రక్షణ లేదు.. స్వాతి ట్వీట్
దిల్లీ శీలంపూర్లో తన 12 ఏళ్ల కొడుకుపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళ తమకు ఫిర్యాదు చేసినట్టు దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వేతా మాలివాల్ వెల్లడించారు. ఈ మేరకు శీలంపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్వో)కు లేఖ రాసి దాన్ని ట్విటర్లో షేర్ చేశారు. ఆ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 18న నలుగురు వ్యక్తులు బాలుడిపై గ్యాంగ్ రేప్ చేసి రహస్య అవయవాల్లో రాడ్డుతో దాడి చేశారు. ఇటుకలు, రాడ్డులతో కిరాతకంగా కొట్టారు. ఈ కిరాతక చర్య గురించి ఈ నెల 22న బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు వెంటనే దిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి చాలా విషమంగా ఉందని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతుడున్నాడు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఈ వ్యవహారంపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు నిందితుల అరెస్టు, తీసుకున్న చర్యలపై ఈ నెల 28లోగా సవివరమైన నివేదిక ఇవ్వాలి’’ అని స్వాతి మాలివాల్ లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM