Crime News: హైదరాబాద్‌ ఛత్రినాక వద్ద పేలుడు.. ఇద్దరు మృతి

ఛత్రినాక పరిధి కందికల్‌ గేట్‌ వద్ద గురువారం రాత్రి పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

Updated : 05 Nov 2021 12:27 IST

హైదరాబాద్‌: నగరంలోని ఛత్రినాక పరిధి కందికల్‌ గేట్‌ వద్ద గురువారం రాత్రి పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితున్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. అనంతరం క్లూస్‌టీమ్‌ బృందం అక్కడికి చేరుకొని ఘటనాస్థలిని పరిశీలించింది.  మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు(25), జగన్నాథ్‌(30)గా గుర్తించారు. చనిపోయిన వారు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులుగా పోలీసులు గుర్తించారు. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణసంచా కారణంగానే పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. బాణసంచాకు రసాయనాలు కలవడంతో పేలుడు తీవ్రత ఎక్కువైనట్లు పోలీసులు పేర్కొన్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని