దిల్లీ..ఇజ్రాయల్‌‌ ఎంబసీ వద్ద బాంబు పేలుడు

దేశరాజధాని దిల్లీలోని ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది.

Updated : 29 Jan 2021 18:19 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. బాంబు పేలుడు దృష్ట్యా ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని