Crime news: ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు .. ఆత్మహత్యగా పోలీసుల అనుమానం!

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. .....

Published : 28 May 2022 16:25 IST

చెన్నై: తమిళనాడులో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఓ వ్యక్తితో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలను చెన్నై సబర్బన్‌  పొలిచలూరులోని ఓ ఇంట్లో పోలీసులు ఈ ఉదయం గుర్తించారు. అయితే, పోలీసులు దీన్ని ఆత్మహత్యలుగా అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని తొలుత తన భార్య, పిల్లలను చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్ల కారణంగానే అతడు ముందుగా ముగ్గురిని చంపేసి.. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనబడుతోందన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని