ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని వేగేశ్వరపురంలో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు...

Updated : 12 Jul 2021 04:06 IST

తాళ్లపూడి: పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని వేగేశ్వరపురంలో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి తన కుమార్తె (9), కుమారుడి (7)తో కలిసి ద్విచక్రవాహనంపై గోదావరి ఒడ్డుకు వచ్చారు. వారితో తీసుకొచ్చుకున్న అల్పాహారాన్ని తినేసి కాసేపు అక్కడే గడిపారు. కాసేపటి తర్వాత ఒక్కసారిగా తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకేశాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తాళ్లపూడి ఎస్‌ఐ సతీష్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు, గజ ఈతగాళ్ల  సాయంతో గాలింపు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న ద్విచక్రవాహనం నంబర్‌ ఆధారంగా వివరాలు పరిశీలించగా.. భీమవరానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని