TS news: తండ్రి చావు... కుమార్తె వివాహం
కుమార్తె వివాహాన్ని ఘనంగా చేయాలని ఆ తండ్రి శుభలేఖలు పంచాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. విధి వక్రీకరించడంతో అనారోగ్యం బారినపడి తనకుమార్తె వివాహాన్ని ఘనంగా చేయాలని ఆ తండ్రి శుభలేఖలు పంచాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. విధి వక్రీకరించడంతో అనారోగ్యం బారినపడి తన
బీర్కూర్: కుమార్తె వివాహాన్ని ఘనంగా చేయాలని ఆ తండ్రి శుభలేఖలు పంచాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. విధి వక్రీకరించడంతో అనారోగ్యం బారినపడి తన కూతురి పెళ్లి కనులారా చూడకుండానే కన్నుమూశాడు. ఉదయం తండ్రి మరణించడం.. సాయంత్రం కుమార్తె వివాహం జరగడం వంటి అరుదైన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ గూడ్సాబ్ (48) అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం ఆయన కొన్నేళ్లు దుబాయి వెళ్లారు. కొంతకాలం తర్వాత స్వగ్రామానికి వచ్చి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. తన మూడో కుమార్తె తబషంకు సోమవారం పెళ్లి చేయాలని కొద్ది రోజుల కిందటే నిశ్చయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అకస్మాత్తుగా గూడ్సాబ్ శుక్రవారం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఈ ఉదయం మృతిచెందాడు. దీంతో పెళ్లి సజావుగా సాగిపోతుందని భావించి వచ్చిన బంధువులు మధ్యాహ్నం మృతుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలతో సాయంత్రం వివాహాన్ని జరిపించారు. చిన్న కుమారుడు దుబాయిలోనే ఉండడంతో తండ్రి కడచూపునకు నోచుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...