Crime News: ఆడపిల్ల పుట్టిందని.. మెడకు దారం బిగించి చంపిన తండ్రి

కుమార్తె పుట్టిందని మొదటి నుంచి కోపంతో ఉన్న రాము పల్లుర్‌.. చివరికి ఆమెను కడతేర్చి కర్కశత్వాన్ని చాటుకున్నాడు.

Updated : 03 Dec 2022 09:28 IST

యాదగిరి, న్యూస్‌టుడే: కుమార్తె పుట్టిందని మొదటి నుంచి కోపంతో ఉన్న రాము పల్లుర్‌.. చివరికి ఆమెను కడతేర్చి కర్కశత్వాన్ని చాటుకున్నాడు. తన తొమ్మిది నెలల కుమార్తె తనుశ్రీని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని యాదగిరి సమీప బద్దెపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. కూలి పనులు చేసుకునే రాము పల్లుర్‌తో సావిత్రి దంపతులకు తొమ్మిది నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. పాపను చూసుకునేందుకు సావిత్రి ఇంట్లోనే ఉండేది. నువ్వు పనిలోకి వెళితే- పాపను చూసుకుంటానని చెప్పిన రాముపల్లుర్‌ మద్యం తాగి పడుకున్నాడు. పాప ఏడుపుతో నిద్రాభంగం కావడంతో ఆమె మెడలో ఉన్న దిష్టి దారాన్నే బిగించి హత్య చేశాడు. సావిత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి పాప మృతదేహం పక్కన ఏమీ తెలీనట్లు పడుకున్న భర్త కనిపించాడు. ఇరుగుపొరుగుల సహకారంతో భర్తను బంధించి పోలీసులకు అప్పగించింది. యాదగిరి గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని