కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. రామాలయం రోడ్డులోని టీవీ రిపేరింగ్‌ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు భయభ్రాంతులకు

Updated : 06 Jan 2021 04:41 IST

మూసాపేట: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. రామాలయం రోడ్డులోని టీవీ రిపేరింగ్‌ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌పీ నాలుగో ఫేస్‌కు చెందిన అన్నం రమేష్‌ కూకట్‌పల్లి రామాలయం సమీపంలో కొద్ది కాలంగా ఎలక్ట్రానిక్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లిన కొద్ది సమయంలోనే దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని యాజమాని రమేష్ తెలిపారు. 

ఇవీ చదవండి..

ముసుగులేసుకొచ్చి కత్తులతో దాడి

మహిళపై పెట్రోల్‌తో ఉన్మాది దాడి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని