గుంటూరు జీజీహెచ్లో అగ్నిప్రమాదం
గుంటూరు నగరంలోని జీజీహెచ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని కొవిడ్ రోగులను ఉంచే ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ
గుంటూరు: గుంటూరు నగరంలోని జీజీహెచ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని కొవిడ్ రోగులను ఉంచే ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం సమయంలో 15మంది కరోనా రోగులు, ఐదుగురు డయాలసిస్ రోగులు ఉన్నట్టు సమాచారం. ఆస్పత్రి రెండో అంతస్తులోని ఐసీయూ వార్డు నుంచి వారిని సురక్షితంగా బయటకు తరలించారు. మొదట మంటలు చెలరేగగానే అవినాష్ అనే యువకుడు అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తెచ్చాడు. నాట్కో క్యాన్సర్ ఆసుపత్రిలో అవినాష్ పొరుగు సేవల ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేసిన అవినాష్ను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అమ్మిరెడ్డితో పాటు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్