TS News: ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంట్లో అగ్నిప్రమాదం..సతీమణికి అంటుకున్న మంటలు

మెట్‌పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.

Updated : 08 Jan 2022 13:05 IST

మెట్‌పల్లి: మెట్‌పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. వంటగదిలో పిండివంటలు చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ లీకై ప్రమాదం జరిగింది. సంక్రాంతిని పురస్కరించుకొని సకినాలు చేస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే సతీమణి సరోజకు మంటలు అంటుకున్నాయి. వెంటనే బంధువులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని